Advertisement

'గోమూత్రం శానిటైజర్' తో కరోనా ఖతం..!

By: Anji Thu, 17 Sept 2020 1:28 PM

'గోమూత్రం శానిటైజర్' తో  కరోనా ఖతం..!

చేతుల్లో కరోనాను ఖతం చేసేందుకు 'గోమూత్రం శానిటైజర్' తయారు చేస్తున్నారు. గుజరాత్, జామ్ నగర్ జిల్లాలోని కామధేను దివ్య ఔషధి మహిళా సహకార మండలి సభ్యులు. ఆల్కాహాల్, ఇతర రసాయనాలతో తయారైన శానిటైజర్లు కరోనా నుంచి కాపాడతాయేమో కానీ, చర్మానికి మాత్రం తీరని హాని కలిగిస్తాయని.. అందుకే గోమూత్రం శానిటైజర్ తయారు చేస్తున్నామని తెలిపారు.


ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ గోమూత్రం శానిటైజర్.. వైద్యులు ధ్రువీకరించాకే మార్కెట్లోకి వస్తుందని స్పష్టం చేశారు కల్పనా. గ్రామీణ మహిళలకు ఈ శానిటైజర్ తయారీ ఉపాధి కల్పిస్తుందన్నారు. మా మండలిలో సుమారు 250 మంది మహిళా సహకారులున్నారు. గోమూత్రం నుంచి ఈ మహిళలు ఎరువులు, కీటకనాశినిలను తయారు చేస్తారు.

ఇప్పుడు శానిటైజర్ తయారీకి పూనుకున్నాం. ఈ శానిటైజర్లో వేప, తులసి వంటి ఆయుర్వేద గుణాలున్న ఆకులను వినియోగిస్తున్నాం. మార్కెట్లో లభిస్తున్న శానిటైజర్లకంటే.. సహజసిద్ధ పదార్థాలతో తయారయ్యే గోమూత్రం శానిటైజర్ ఎన్నో రెట్లు సురక్షితమైనది అని కామధేను దివ్యా ఔషధి మహిళా సహకార మండలి అధ్యక్షురాలు కల్పనాబెన్ అన్నారు.

Tags :

Advertisement