Advertisement

  • కరోనా బులెటిన్: తెలంగాణలో ఈ రోజు 2,381 నమోదు,10 మరణాలు

కరోనా బులెటిన్: తెలంగాణలో ఈ రోజు 2,381 నమోదు,10 మరణాలు

By: Anji Fri, 25 Sept 2020 09:48 AM

కరోనా బులెటిన్: తెలంగాణలో ఈ రోజు 2,381 నమోదు,10 మరణాలు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గినా.. మళ్లీ పెరుగుతున్నాయి... నిన్న భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 2,381 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటి వరకు 1080 మంది మృతి చెందారు.


ప్రస్తుతం రాష్ట్రంలో 30,387 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,50,160 మంది పూర్తిగా కోలు కున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 386, రంగా రెడ్డి జిల్లాలో 227, మేడ్చల్‌లో 193 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక, భారత్‌ లో కరోనా మరణాల రేటు 1.58% గా ఉంటే.. తెలంగాణలో 0.59 %గా ఉంది. ఇక, కరోనా రికవరీ రేటు దేశ వ్యాప్తంగా 81.71%గా ఉండగా.. తెలంగాణలో 82.67% శాతానికి పెరిగింది.

Tags :

Advertisement