Advertisement

  • ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా చెయ్యండి... లేకుంటే...!

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా చెయ్యండి... లేకుంటే...!

By: Anji Sat, 12 Dec 2020 5:21 PM

ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా చెయ్యండి... లేకుంటే...!

ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పరగడుపున తీసుకొనే ఆహారం విషయంలో తప్పక శ్రద్ధ పెట్టాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం నిద్ర లేచిన వెంటనే తగినన్ని నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పెద్ద ప్రేగు శుభ్రముగా అయి జీర్ణ వ్యవస్థ పనితీరు పెరగటంతో బాటు కండరాలకు ఉత్తేజం కలుగుతుంది.

గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగితే కొవ్వు కూడా కరుగుతుంది. అవసరమైతే తేనె కూడా కలుపుకోవచ్చు.

చాలామంది లేవగానే బెడ్ కాఫీ, టీ తాగుతుంటారు గానీ వీటిని పరగడుపున తీసుకోవటం వల్ల హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే ఈ అలవాటున్నవారు మొదట గ్లాసు నీళ్లు తాగి ఓ పావుగంట తరవాత వీటిని తీసుకోవడం మంచిది. ఉదయం పూట తప్పక తేలిగ్గా అరిగే అల్పాహారం తీసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారంలో ఘాటైన మసాలాలూ, గ్రేవీ కూరలు వద్దు.

దీనివల్ల పొట్టలో తిప్పినట్లుండటం, రోజంతా నిరుత్సాహంగా ఉండే ప్రమాదం ఎక్కువ. అందుకే చపాతీ, పూరీ, పులావ్ లకు బదులు ఇడ్లీ, వడ, ఓట్స్ వంటివి తీసుకోవటం మంచిది. అల్పాహారంగా మ్యాగీ అసలే వద్దు.

ఉదయాన్నే మొలకెత్తిన గింజల్ని తినేవారు అందులో బొబ్బర్లు లేకుండా చూసుకోవాలి. బొబ్బర్లు చాలా ఆలస్యంగా జీర్ణం అవుతాయి కనుక ఖాళీ కడుపుతో తింటే అలసట, గ్యాస్‌ వంటి సమస్యలు రావచ్చు.

కొందరు ఉదయాన్నే నారింజ, బత్తాయి, టమోటో రసం తీసుకొంటారు. దీనివల్ల వాటిలోని ఆమ్లం ఎసిడిటీ, గుండెలో మంట, అల్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఉదయం ఖాళీ కడుపుతో అరటి పండు తినరాదు. అరటి పండులో అధికంగా ఉండే మెగ్నీషియం ఒక్కసారి శరీరానికి అందటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు.

రాత్రి పొద్దుపోయేవరకు పనిచేసే కాల్ సెంటర్ ఉద్యోగులు, పాత్రికేయులు ఏ అర్ధరాత్రికో తిని, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో వీరు నిద్రలేవగానే కనీసం అర లీటరు నీరు తాగితే రాత్రి ఆహారపు ప్రభావము తగ్గుతుంది.

కొందరు నిద్రలేవగానే ఖాళీ కడుపుతో వాకింగ్‌ లేదా జాగింగ్‌కు వెళ్లిపోతారు. దీనివల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరగదు. దీనికి బదులు వ్యాయామానికి వెళ్లే 10 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి , ఆ తర్వాత ఓ కప్పు గ్రీన్‌ టీ తాగి వెళ్లడం మంచిది. యోగాకూ ఈ నియమం వర్తిస్తుంది.

Tags :
|

Advertisement