కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..
By: Dimple Wed, 19 Aug 2020 11:08 PM
★ కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.
★ ఏది తినాలో తెలియక పొట్ట నిండా ఆహారం కురుకుంటున్నారు.
★ చివరికి జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు.
★ అలా కాకుండా రోజంతా మితంగానే పౌష్టికాహారం తీసుకుంటే మేలని వైద్యులు చెబుతున్నారు.
★ సరైన పద్ధతిలో పోషకాహారం తీసుకుంటే తొందరగా రికవరీ అవొచ్చు.
★ శక్తినిచ్చే పిండి పదార్థాలు కొవ్వులు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజాలు సరిపడా తీసుకుంటేనే తొందరగా కోలుకోవచ్చు.
★ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పాలు తీసుకోవాలి.
★ అల్పాహారంగా రాగి మాల్ట్ మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు.
★ ఉడికించిన గుడ్డు రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవడం మేలు.
★ కరోనా బారిన పడని వారికి కోలుకున్న వారికి విటమిన్ సి ఎంతో కీలకం.
★ అందుకే సిట్రస్ జాతి పండ్లు అయిన నిమ్మ ఆరెంజ్ ను కచ్చితంగా తీసుకోవాలి.
★ విటమిన్ సి లభించే క్యాప్సికం బ్రోకోలి క్యారెట్ పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకోవాలి.
★ వేడి నీళ్లలో తేనె నిమ్మరసం వేసి తీసుకుంటే సమృద్ధిగా విటమిన్ సి లభిస్తుంది.
★ మధ్యాహ్న భోజనంలో రొట్టె చేర్చాలి.
★ పప్పు ఆకుకూరలు విటమిన్ సి లభించే కూరగాయలు చికెన్ చేప తీసుకోవచ్చు.
★ సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఉడికించిన పల్లీలు శనగలు వేయించిన బఠానీలు నానబెట్టిన బాదం బొబ్బర్లు అలసందలు పెసలు తీసుకోవచ్చు.
★ ఈ పప్పు ధాన్యాలతో శక్తితో పాటు ప్రోటీన్లు ఐరన్ జింక్ వివిధ విటమిన్లు లభిస్తాయి.
★ గుమ్మడి గింజలతో అధికంగా జింకు పొందొచ్చు.
★ నీరసంగా ఉన్నవారు మాంసకృత్తులు అధికంగా లభించే నువ్వులను బాగా వాడాలి.
★ నువ్వులతో చేసే పచ్చళ్లతో పాటు బెల్లంతో నువ్వుల ఉండలు చేసుకొని ఆహారంగా తీసుకోవచ్చు.
★ రక్తహీనతకు నువ్వులతో చెక్ పెట్టొచ్చు.
★ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష తీసుకోవడం కూడా మేలే.
★ ఆకుకూరలు పాల కూర ఎంతో ప్రయోజనకారి.
★ విటమిన్ సి ఉండే పండ్లు కివి బొప్పాయి తీసుకోవాలి.
★ ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా బారిన పడ్డవారు తొందరగా కోల్పోవచ్చు.
★ వీటన్నిటికంటే కీలకమైనది సమయానికి తినడం సరిపడా నిద్ర.