చుట్ట ఓ వ్యక్తి ప్రాణం తీసింది...
By: chandrasekar Sat, 12 Dec 2020 8:09 PM
ధూమపానం ఓ వ్యక్తి
నిలువునా సజీవంగా కాల్చేసింది. ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలం టేకులపల్లిలో ఓ ఘటన
జరిగింది. అతను మంచంపై పడుకుని చుట్ట తాగుతూ
నిద్రలోకి వెళ్లగా ఆ చుట్ట నోట్లో నుంచి కింద పడి మంచం కింద ఉన్న గడ్డికి
అంటుకోవడంతో సజీవదహనం అయ్యాడు. వెంకన్న అనే 70 ఏళ్ల వ్యక్తి గంగిరెద్దులు తిప్పుతూ జీవనం
సాగి౦చేవాడు. అతనికి రెండు గంగిరెద్దులు ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం భోజనం
అనంతరం ఎప్పటిలాగే తన గుడిసె వద్ద కునుకు వేసేందుకు నులక మంచంపై చుట్ట తాగుతూనే
పడుకున్నాడు. నోట్లోనే ఉండగా వెంకన్న క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు. నోట్లోని
చుట్ట మంచం కింద ఉన్న గడ్డిపై పడింది.
దీంతో నిప్పు గడ్డికి
అంటుకోవడంతో మంటలు రేగాయి. అక్కడ పెద్ద మొత్తంలో గడ్డి ఉండడంతో క్షణాల్లో మంటలు
వ్యాపించాయి. మెలకువ వచ్చిన వెంకన్న తప్పించుకునే అవకాశం కూడా లేకుండా మంటలు
చెలరేగాయి. దీనివల్ల వెంకన్న సజీవ దహనమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా
స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసారు