యంగ్ హీరో శర్వానంద్. వెంకటేష్ స్థానాన్ని భర్తీ చేయనున్నారని టాక్.
By: chandrasekar Thu, 16 July 2020 7:05 PM
క్రియేటివ్ డిఫరెన్సెస్
కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్
హీరోగా తెరకెక్కనున్న సినిమా ఆగిపోయిందట. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో
ఉన్నారు. ఈ ఏడాది ‘వెంకీ మామ’ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వెంకీ. ఆ తరవాత
డిఫెంట్ జోనర్లలో వరుసపెట్టి సినిమాలు అంగీకరించారు. ముందుగా ‘నారప్ప’ సినిమాతో
ప్రేక్షకులను పలకరించనున్నారు.
తమిళ హిట్ మూవీ
‘అసురన్’కు రీమేక్గా తెరకెక్కుతోన్న ‘నారప్ప’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ
సినిమాతో పాటు ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు, ‘నేను
శైలజ’ దర్శకుడు కిశోర్ తిరుమలతో ప్రాజెక్ట్లను లైన్లో పెట్టారు వెంకటేష్. కిశోర్
తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమా గురించి కొన్ని నెలల క్రితం అధికారిక
ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఇదిలా ఉంటే, ఈ
సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా
ఆగిపోయిందని అంటున్నారు. వెంకటేష్కి, దర్శకుడు కిశోర్కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్
రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసుకున్నారని సమాచారం. అయితే, వెంకటేష్
స్థానంలో మరో హీరో ఎంపిక కూడా జరిగిపోయిందట. యంగ్ హీరో శర్వానంద్. వెంకటేష్
స్థానాన్ని భర్తీ చేయనున్నారని టాక్.
ఇక ‘నారప్ప’ విషయానికి
వస్తే.. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రలో తెలుగులో వెంకటేష్ నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన వెంకీ ‘నారప్ప’ ఫస్ట్ లుక్, ఇతర ఫొటోషూట్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి
స్పందన వచ్చింది. వెంకటేష్కు జంటగా ప్రియమణి నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల
దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో కార్తీక్ రత్నం, ప్రకాష్
రాజ్, మురళీ
శర్మ, సంపత్
రాజ్, రాజీవ్
కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం
సమకూరుస్తున్నారు. తమిళ నిర్మాత కలైపులి ఎస్. థానుతో కలిసి దగ్గుబాటి సురేష్ బాబు
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.