Advertisement

‘యశ్‌’కు తెలుగునాట కూడా గొప్ప క్రేజ్‌

By: chandrasekar Fri, 17 July 2020 5:01 PM

‘యశ్‌’కు తెలుగునాట కూడా గొప్ప క్రేజ్‌


కెజీఎఫ్‌ చిత్రంలో ‘యశ్‌’ నటనకు కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ కూడా ఫిదా అయ్యారు. దాంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారాడు ‘యశ్‌’.

తెలుగులో విడుదలైన అతని తొలి చిత్రం ‘కేజీఎఫ్‌’ రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిందంటే యశ్‌కు తెలుగునాట వున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’లో నటిస్తున్న ఈ కన్నడ నటుడు 12 ఏండ్లు కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్‌ -2 విడుదల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే అరవై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి రిలీజ్‌ చేస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమా విడుదల కాబోతుందన్న వార్తలను కూడా చిత్ర యూనిట్‌ ఇటీవలే ఖండించిన విషయం తెలిసిందే.

అలాగే కెజీఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను ఫ్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.

Tags :
|
|
|
|

Advertisement