బుల్లితెరపై అధిక టార్గెట్ రేటింగ్ పాయింట్ నమోదు చేసిన వినయ విధేయ రామ
By: chandrasekar Sat, 06 June 2020 7:09 PM
రామ్ చరణ్ ప్రధాన
పాత్రలో బోయపాటి శీను తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ.
డిజాస్టర్గా నిలిచిన చిత్రం కమర్షియల్గా కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
ఇక ఈ సినిమా బుల్లితెరపై కూడా పెద్దగా టీఆర్పీలు సాధించదని మెగా ఫ్యాన్స్
భావించారు. కాని అంచనాలని తలకిందులు చేస్తూ మంచి టీఆర్పీలు రాబడుతుంది. వినయ
విధేయ రామ చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందగా, ఇందులోని
యాక్షన్ సీన్స్ బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.
బుల్లితెరపై 8
సార్లు ప్రదర్శితమైన ఈ సినిమా తక్కువ టీఆర్పీ 5.19 కాగా, హై
టీఆర్పీ 8.2. యావరేజ్గా 7.4 అని తేల్చారు. తాజాగా ప్రసారమైన ఈ చిత్రానికి 7.98 టీఆర్పీ
రావడం విశేషం. లెక్కలని బట్టి చూస్తుంటే వినయ విధేయ రామ చిత్రం బుల్లితెర
ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. కైరా అద్వానీ కథనాయికగా నటించిన
ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.