దర్శకుడిగా విక్రమ్, అక్కినేని నాగచైతన్యతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్
By: chandrasekar Tue, 23 June 2020 2:03 PM
కమర్షియల్గా ఆశించిన
ఫలితాన్నందుకోకపోయి ఉండొచ్చేమో కానీ ఇటు హీరో సూర్య కెరీర్లో, అటు
దర్శకుడు విక్రమ్ కుమార్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ‘24’ ఒకటి.
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ను విక్రమ్ అద్భుత రీతిలో మలిచాడు. సూర్య అదిరిపోయే
పెర్ఫామెన్స్తో అలరించాడు. దర్శకుడిగా విక్రమ్, హీరోగా సూర్య తమ పతాక
స్థాయిని చూపించిన చిత్రమిది. ఈ చిత్రానికి దక్కాల్సిన స్థాయి విజయం దక్కలేదు.
బొటాబొటి వసూళ్లతో సరిపెట్టుకుంది.
ట్విస్టుల మీద
ట్విస్టులతో సాగిపోయే ఈ చిత్రం ఇప్పుడెక్కడైనా టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు అతుక్కుపోయి
చూడాల్సిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఐతే
బాక్సాఫీస్ సక్సెస్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లో ఏమో సూర్య, విక్రమ్
ఆ దిశగా వెంటనే అడుగులు వేయలేదు. ‘24’కు సీక్వెల్ లేదనుకోవడానికి మాత్రం లేదని అంటున్నాడు
విక్రమ్.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో
విక్రమ్ మాట్లాడుతూ ‘24’ సీక్వెల్ మీద పని చేస్తున్నట్లు చెప్పాడు. ‘24’ చేస్తున్నపుడే
దీనికి సీక్వెల్ చేయాలని తాను, సూర్య అనుకున్నామని ఆ తర్వాత కూడా ఒకట్రెండుసార్లు
చర్చించుకున్నామని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పాడు విక్రమ్.
అక్కినేని నాగచైతన్యతో ఓ
ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే ప్రయత్నంలో ఉన్నాడు విక్రమ్. దాని తర్వాత ‘24’ సీక్వెల్
పట్టాలెక్కొచ్చని భావిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో హాలీవుడ్లో ఎన్నో
సినిమాలు వచ్చాయి. ఇండియాలో మాత్రం ఈ జానర్ను టచ్ చేసిన వాళ్లు తక్కువ. ‘ఆదిత్య 369’ తర్వాత
‘24’తో
పాటు తమిళంలోనే ‘ఇండ్రు నేట్రు నాల్’ అనే మరో మంచి సినిమా ఈ జానర్లో వచ్చాయి.