Advertisement

  • పవన్ కళ్యాణ్ ద్వారా వైరల్ అవుతున్న వీడియో ...

పవన్ కళ్యాణ్ ద్వారా వైరల్ అవుతున్న వీడియో ...

By: chandrasekar Mon, 31 Aug 2020 9:19 PM

పవన్ కళ్యాణ్ ద్వారా వైరల్ అవుతున్న వీడియో ...


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు దేశానికి సంబంధించి స్ఫూర్తి కలించే పోస్టులను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటారు. తాజాగా ఆదివారం ‘‘మన మాతృభూమి గొప్పదనం ఇదీ..’’ అని ట్వీట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియోను పోస్టు చేశారు. ఇటీవలే పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓ గుడి వద్ద అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక దేవాలయం దగ్గర ముస్లింలు మానవహారంలా నిలబడి గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వీడియోను పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2న కావడంతో పవన్ అభిమానులు అప్పుడే కోలాహలం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని జనసేన నాయకుడు తోట సాయి జనసేనపై ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ పాటను జనసేన నాయకుడు పోతిన మహేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ అడిగిన వ్యక్తికి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దళితులపై అరాచకాలు జరుగుతున్నాయని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :
|
|

Advertisement