Advertisement

  • క్రిష్ వేదం సినిమాకు పదేళ్లు..వీడియో కాల్ లో విషెస్ చెప్పుకున్న చిత్ర యూనిట్

క్రిష్ వేదం సినిమాకు పదేళ్లు..వీడియో కాల్ లో విషెస్ చెప్పుకున్న చిత్ర యూనిట్

By: Sankar Thu, 04 June 2020 7:52 PM

క్రిష్ వేదం సినిమాకు పదేళ్లు..వీడియో కాల్ లో విషెస్ చెప్పుకున్న చిత్ర యూనిట్

స్టైలిష్ స్టార్ బన్నీ , రాక్ స్టార్ మంచు మనోజ్ , అనుష్క లాంటి స్టార్ లతో క్రిష్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం వేదం..ఈ సినిమా విడుదల అయి నేటికీ సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకుంది..యం.యం.కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు విడుదల చేశారు. ఇది క్రిష్‌కు రెండో సినిమానే అయినా అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ మరోసారి కలిసింది. అయితే, ఇది కరోనా కాలం కావడంతో అంతా ఒక చోట కలవకుండా ఆన్‌లైన్‌లో కలిశారు. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, క్రిష్, యం.యం.కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ వీడియో కాల్ ద్వారా మీట్ అయ్యారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీడియో కాల్ స్క్రీన్ షాట్ కూడా పొందుపరిచారు.

దశాబ్దం తరవాత వేదం టీమ్‌తో వీడియో కాల్‌లో ఇంటరాక్ట్ అయ్యింది. పదేళ్ల తరవాత కూడా ప్రతి ఒక్కరూ సినిమాపై, అప్పటి అనుభవాలపై అదే గొప్ప ఫీలింగ్‌తో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన అభిరుచితో ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. మరపురాని చిత్రమైన ‘వేదం’కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ‘వేదం’ పదేళ్లు పూర్తిచేసుకోవడంపై మంచు మనోజ్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘అద్భుతమైన సినిమాకు పదేళ్లు. వివేక్ చక్రవర్తి పాత్ర చేయడం గొప్పగా భావిస్తున్నాను. డైరెక్టర్ క్రిష్ ప్రతిభతో ‘వేదం’ ఒక ప్రభావవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కచ్చితంగా మరో పదేళ్లు గుర్తుండిపోతుంది అని అన్నారు


Tags :
|
|

Advertisement