మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం థ్రిల్లింగ్గా ఉంది..వాణీ కపూర్
By: Sankar Wed, 15 July 2020 4:23 PM
కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు సినిమా ఇండస్ట్రీ సైలెంట్ గా ఉంది ..షూటింగ్లు , థియేటర్లు అన్ని బంద్ అయ్యాయి ..దీనితో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా సినీ నటులు అందరు ఇంట్లోనే ఉన్నారు..అయితే ఇటీవలే ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో సినిమా షూటింగ్స్ మెల్లగా ఒక్కొక్కటిగా ప్రారంభంఅవుతున్నాయి.అయితే చాలా రోజుల తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు హీరోయిన్ వాణీ కపూర్. ప్రస్తుతం ఈ అందాల భామ అక్షయ్కుమార్ హీరోగా నటిస్తున్న ‘బెల్బాటమ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది..
చాలా గ్యాప్ తర్వాత షూటింగ్లో పాల్గొనడం నిజంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ.. అన్ని నివారణ చర్యలను దృష్టిలో ఉంచుకుని మెదులుతున్నా. మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం థ్రిల్లింగ్గా ఉంది.’ అని వాణికపూర్ ట్వీట్ చేశారు.
కాగా, వాణికపూర్ మొదటిసారి అక్షయ్కుమర్తో కలిసి నటిస్తున్నారు. అక్షయకుమార్తో కలిసి నటించడం తనకు లభించిన గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు. బెల్బాటమ్ చిత్రానికి రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహిస్తుండగా, వశు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్శిక దేశ్ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 80వ దశకంలో జరిగిన నిజజీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.