పీపీఈకిట్ ధరించి ప్రయాణించా: లావణ్య త్రిపాఠి
By: chandrasekar Thu, 20 Aug 2020 5:40 PM
కథానాయిక లావణ్య త్రిపాఠి కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం ఇంట్లో కూడా తాను
మాస్క్ ధరిస్తున్నానని అంటోంది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో చిక్కుకుపోయిన
ఆమె ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే స్వస్థలం డెహ్రాడూన్కు వెళ్లింది. తాను ఎదుర్కొన్న
అనుభవాల్ని గురించి లావణ్య త్రిపాఠి చెబుతూ ‘ఒంటరితనాన్ని నేను ఎప్పుడూ ఇబ్బందిగా
ఫీలవ్వను. స్వతంత్రంగా బతకాలనే ఆలోచనతో పదహారేళ్ల వయసులోనే కుటుంబాన్ని విడిచి
ఒంటరిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను.లాక్డౌన్ సమయంలో హైదరాబాద్లో చిక్కుకుపోయానని
భయపడలేదు.
నాలోని నైపుణ్యాలను మెరుగులు దిద్దుకోవడంపై ఈ విరామంలో దృష్టిపెట్టా. జనవరిలో చివరిసారిగా కుటుంబసభ్యుల్ని కలిశా.
ఆరు నెలల పాటు వారికి దూరంగా ఉండటం కష్టంగా అనిపించింది. కరోనా ప్రభావ ఎక్కువగా
ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డెహ్రాడూన్ వెళ్లడానికి చాలా భయపడ్డాను. అనుకోకుండా
నేను వైరస్ బారిన పడితే నా వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకూడదనే పీపీఈకిట్
ధరించి ప్రయాణించా. ఊరు చేరుకోగానే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా. నెగెటివ్ రిపోర్ట్
వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికీ ఇంట్లో మాస్కు ధరిస్తున్నా’ అని లావణ్య తెలిపింది.