అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ సినిమా ఫై హల్ చల్
By: chandrasekar Tue, 18 Aug 2020 5:13 PM
తమిళ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్హాసన్ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాను యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తాడని ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై తాజాగా దర్శకుడు లోకేష్ స్పందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రానికి చెందిన కొత్త చిత్రం నిర్మాణంపై చర్చలు కొనసాగుతున్నాయని లోకేష్ కనకరాజ్ తెలిపారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. కమల్కు చెందిన రాజ్కమల్ బ్యానర్పై నిర్మించనున్న 50వ సినిమాలో రజనీకాంత్ నటించనున్నట్లు, ఆ చిత్రానికి తాను దర్శకుడిగా ఎంపికైట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతానికి ఆ చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక స్థాయి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని.పూర్తి వివరాలను లాక్డౌన్ తర్వాత రాజ్కమల్ సంస్థ వెల్లడిస్తుందని లోకేష్ కనకరాజ్ తెలిపాడు. ఇక ఆయన దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం 'ఖైదీ'. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు, దానికి తోడు మంచి తండ్రి కూతురు సెంటిమెంట్.. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే రీతిలో కథ కథనాలు సినిమాకు మంచి విజయాన్ని అందించాయి. కాగా ఈ ఖైదీ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. ఈ హిందీ ఖైదీని కూడా లోకేష్ కనకరాజే దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.