యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫొటోస్ వైరల్...!
By: Anji Tue, 20 Oct 2020 08:14 AM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడగా..తాజాగా కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టడం తో మళ్లీ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇటలీ లో ఉంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. వీరు యమ స్పీడ్ గా పని కానిచ్చేస్తున్నారు.
ఇప్పటికే అక్కడ కొన్ని కీలక ప్రదేశాల్లో షూట్ జరుగుతున్న ఆన్ లొకేషన్ ఫొటోస్ మరియు షూట్ వీడియోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటలీ వీధుల్లో చిన్నారులతో ప్రభాస్ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పిక్స్ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇలా రోజూ ఏదో ఒక పిక్ పోస్ట్ చేయాలంటే ప్రభాస్కు ఫ్యాన్స్ రిక్వెస్ట్లు పెడుతుండటం విశేషం.