ప్రేమ విహహం చేసుకున్న తెలుగు గేయ రచయిత
By: Sankar Mon, 23 Nov 2020 11:05 PM
గేయ రచయిత శ్రీమణి ఓ ఇంటివాడయ్యాడు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్లుగా తాను ప్రేమిస్తోన్న అమ్మాయి ఫరాను పెళ్లాడాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాల్లో పంచుకున్నాడు. మ్యారెజ్ లైఫ్ బిగిన్స్ అంటూ.. హ్యాష్ట్యాగ్ కూడా పెట్టారు. తమ కల నిజమైందని, తమ హృదయాలను అర్థం చేసుకున్న దేవుడికి, తల్లిదండ్రులకి ధన్యవాదాలని శ్రీమణి అన్నాడు. శ్రీమణికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కాస్త సరదాగా స్పందించారు ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు అర్థమైందంటూ ట్వీట్ చేశాడు. ఉప్పెన సినిమాలో ‘నీకళ్లు నీలి సముద్రం’ అంటూ ఆయన రాసిన పాట సృష్టించిన రికార్డులు మనకు తెలిసిందే.
Tags :
sri mani |
love |