బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి యాడ్ లో మెరిసిన 'ఇస్మార్ట్ శంకర్ '
By: Sankar Mon, 05 Oct 2020 10:06 PM
టాలీవుడ్ హీరో రామ్ ఇప్పటివరకు కేవలం సినిమాలతోనే ప్రేక్షకులను పలుకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ యాక్టర్ తొలిసారి ఓ యాడ్ లో నటించాడు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాంతో కలిసి ప్రకటనలో మెరిశాడు. జాన్ అబ్రహాంతో కలిసి పుష్ అప్స్ చేస్తూ..మరోవైపు గార్నియర్ మ్యాన్ షాంపును ప్రమోట్ చేస్తున్నాడు రామ్.
ఇదిగో నా మొట్టమొదటి బ్రాండ్ ఎండార్స్ మెంట్..గార్నియర్ మ్యాన్ తో అసోసియేట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. యాడ్ షూటింగ్, డబ్బింగ్ చాలా వినోదాత్మకంగా, ఫన్నీగా సాగింది. ఈ టీంతో సుదీర్ఘంగా అసోసియేట్ అయ్యేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు రామ్.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న రామ్ ప్రస్తుతం రెడ్ సినిమాలో నటిస్తున్నాడు. మాళవికా శర్మ. అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి..