Advertisement

  • జయప్రకాశ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు

జయప్రకాశ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు

By: Sankar Tue, 08 Sept 2020 10:48 AM

జయప్రకాశ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు


రంగ‌స్థ‌ల న‌టుడిగా కెరీర్‌ని ప్రారంభించి టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గుండెపోటుతో బాత్‌రూమ్‌లో కుప్పకూలి అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జ‌య‌ప్ర‌కాశ్ మృతి సినీ పరిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అంటూ సినీ ప్ర‌ముఖులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి మృతి న‌న్ను క‌లిచివేసింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని అత్యుత్త‌మ న‌టుడు, క‌మెడీయ‌న్స్‌లో ఆయ‌న ఒక‌రు. అతనితో ప‌నిచేయ‌డం ఎల్ల‌ప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. అత‌ని కుటుంబానికి, అభిమానుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని పేర్కొన్నారు..అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను అంటూ ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు..

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గారి మృతి వార్త న‌న్ను షాక్‌కు గురి చేసింది. నేను ఆయనను ప్రేమగా మామా అని పిలుస్తాను. ఆయ‌న మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని న‌ష్టం. ఆయ‌న‌ కుటుంబానికి, ప్రియమైన వారికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. మామ మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అని ర‌వితేజ ట్వీట్ చేశారు..

Tags :
|

Advertisement