కొత్త సినిమా షురూ చేసిన సాయి ధరమ్ తేజ్ ...
By: Sankar Thu, 24 Dec 2020 6:20 PM
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు మూత పడ్డాయి ..అయితే ఇటీవల లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి..ఇక తెలుగులో థియేటర్లలో విడుదలవుతున్న తొలి సినిమా సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బతుకే సో బెటర్...
అయితే ఈ చిత్రం రిలీజ్ కు ఒక రోజు ముందే కొత్త సినిమాను షురూ చేశాడు సాయిధరమ్. కార్తీక్ వర్మ దండు (డెబ్యూట్) దర్శకత్వం వహిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ మూవీ ఇవాళ లాంఛ్ అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తున్నారు.ఈ మూవీలో నటిస్తున్న తారలు, ఇతర వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది టీం. ఈ ప్రాజెక్టు సాయిధరమ్ తేజ 15వ చిత్రంగా వస్తోంది.