Advertisement

ఇద్దరు కథానాయికలు సరసన నాగ చైతన్య

By: chandrasekar Fri, 04 Sept 2020 8:21 PM

ఇద్దరు కథానాయికలు సరసన నాగ చైతన్య


కరోనా కారణంగా మూతపడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పుడిప్పుడే ఆన్ లాక్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతువుంది. ఇద్దరు కథానాయికలు సరసన నాగ చైతన్య కొత్త సినిమాకు ఓకే చెప్పడంతో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. గతంలో అక్కినేని కుటుంబ హీరోలతో 'మనం' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన మరోసారి అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో మాత్రం కొంత నిరాశ పరిచింది. అది అలా ఉంటే ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగ చైతన్యతో చేయనున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరుపుకుంది. కారోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ మధ్య కాలంలో కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్న నాగ చైతన్య 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు.

ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. విక్రమ్ కుమార్ ఇటీవల నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి 'థ్యాంక్యూ' అనే పేరుని వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు. ఇక ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. వీరిలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఇప్పటికే ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. మరో హీరోయిన్‌గా తమిళ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ ను తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. విక్రమ్ కుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల కంటే ఈ సినిమా చాలా విభిన్నం గా తెరకెక్కించాలని చూస్తున్నాడట.

అసలు విక్రమ్ 'మనం' సినిమా తర్వాత ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు. దీంతో నాగ చైతన్యతో ఓ హారర్ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన చైతన్య ఫస్ట్ టైం హారర్ సినిమా చేయనున్నాడు. ఇక కరోనా లాక్ డౌన్ సడలింపుతో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక కూడా పూర్తికావచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతని అభిమానులు ఎప్పుడు కొత్త సినిమా వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

Tags :
|

Advertisement