ఒకసారి ఒక చిత్రం అనే పాలసీ
By: chandrasekar Wed, 30 Sept 2020 3:12 PM
ప్రభాస్ నటించిన బాహుబలి
చిత్రం తరువాత టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలపైనే ద్రుష్టి
పెడుతున్నారు. తమ కేరీర్ లో చేయని రోల్స్ చేస్తూ, డిఫరెంట్ కథలను
ఎంచుకుంటున్నారు. తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా, ఫ్యాన్స్
హర్ట్ అవకుండా అదే సమయంలో కొత్తదనం
ఉండేలా చూసుకుంటున్నారు. మరోవైపు కరోనావైరస్
వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల తమ కేరీర్ గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి
వారికి సమయం దొరికింది. ఈ సమయంలో విన్న మంచి కథలలో కొన్నింటికి ఓకే చెప్పి లాక్
డౌన్ తరువాత దూకుడు ప్రారంభించారు.
నేచురల్ స్టార్ నానీ
ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింఘ రాయ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్
రాధే శ్యామ్, నాగ్ అశ్విన్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీ అయితే జూ. ఎన్టీఆర్ అటు RRR చేస్తూనే
త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుకున్నాడు. కేజీఎఫ్ దర్శకుడితో కూడా సినిమా లిస్ట్ లో
ఉంది.
రవితేజ, విజయ్
దేవరకొండ చెరో మూడు మూడు సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా వేణు శ్రీరామ్, కొరటాల
శివతో మూవీకి ఒప్పుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం మరో చిత్రానికి అంగీకరించలేదు.
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR
లో మాత్రమే
నటిస్తున్నాడు చెర్రీ. మిగితా హీరోల్లా రామ్ చరణ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మెగా
ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకసారి ఒక చిత్రం అనే పాలసీ పాటిస్తున్నాడేమో.