Advertisement

  • నరసింహ నంది దర్శకత్వంలో ... షూటింగ్ ప్రారంభం..!

నరసింహ నంది దర్శకత్వంలో ... షూటింగ్ ప్రారంభం..!

By: Anji Thu, 01 Oct 2020 1:56 PM

నరసింహ నంది దర్శకత్వంలో ... షూటింగ్ ప్రారంభం..!

జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం మరియు నంది అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ... అక్టోబర్ 15 వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం.

ఆస్కార్ అవార్డ్ లో నిలవాలి అనే టార్గెట్ గా కరోనా లాక్ డౌన్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు వల్ల ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం ఐనది.. అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని.

దర్శకుడు నరసింహ నంది అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతు.. 2011లో '1940 లో ఒక గ్రామం' అనే చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ మరియు 3 నంది అవార్డ్ వచ్చాయి. 2013లో 'కమలతో నా ప్రయాణం' చిత్రానికి నంది అవార్డ్ వచ్చింది. 2016 @ లజ్జా సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపడం జరిగింది. ఇటీవలే యూత్ కోసం 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా తీసాను' అన్నారు.

ఈ కొత్త చిత్రానికి DOP మురళి మోహన్ రెడ్డి.సంగీతం సుకుమార్.ఎడిటర్.నాగిరెడ్డి మొ.. వారు సాంకేతికంగా పనిచేస్తున్నారు. అందరూ కొత్త నటీనటులను పరిశీలిస్తున్నాం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం అన్నారు దర్శకుడు నరసింహ నంది.

Tags :

Advertisement