బిగ్ బాస్ ఇంట్లో అందరూ దొంగలే.. ఎవరు మంచి దొంగో.. ఎవరు భలే దొంగో..!
By: Anji Sat, 03 Oct 2020 10:26 PM
శనివారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్లో నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్ హీట్ ఉండబోతుంది. నాలుగోవారం నామినేషన్లో దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, మెహబూబ్, లాస్య, అభిజిత్, స్వాతి దీక్షిత్లు ఉండగా.. ఈ ఏడుగురులో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తితో శనివారం నాటి 28వ ఎపిసోడ్ ప్రారంభమైంది.
గత వారం మొత్తం కిల్లర్ కాయిన్స్ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులంతా దొంగలుగా మారడంతో.. కింగ్ నాగార్జున దొంగా దొంగా వచ్చాడే అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లో అందరూ దొంగలే.. ఎవరు మంచి దొంగో.. ఎవరు భలే దొంగో తేల్చేసుకుందాం అంటూ మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూపించారు. ఇక హౌస్లో ఎప్పటిలాగే మోనాల్తో అఖిల్, హారికతో అభిజిత్తో పొదుపొద్దునే పులిహోర కలిపడం మొదలుపెట్టారు.
ఇంటిలో ఎవరికివారే కనెక్షన్ పెట్టుకుని ఉంటున్నారని.. నేను కూడా అందుకే కొంత మందితో దగ్గరగా ఉంటున్నాని చెప్పింది మొనాల్. ఇక హారిక అయితే అభితో ముచ్చట్లు పెట్టి.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్పై చర్చించింది. నన్ను మొహమాటం లేకుండా నామినేట్ చేసిన వాళ్లను నేను కూడా వదిలిపెట్టను అంటూ మంగమ్మ శపథం చేసింది. గతవారం అఖిల్.. హారికను నామినేట్ చేయడంతో ఇన్ డైరెక్ట్గా అతన్ని నామినేట్ చేస్తునట్టు అభితో చెప్పింది.
నేను కూడా అఖిల్నే నామినేట్ చేస్తా.. నేను మోనాల్తో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు.. అంటూ తన అసలు బాధను చెప్పుకున్నాడు అభి. మొత్తానికైతే జంటగా హౌస్లో ఉంటున్న అభి, హారికలు జంటగానే అఖిల్ని నామినేట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. మొదటి రెండు వారాలు బాగానే ఉన్నాడు కానీ.. తరువాతే మారిపోయాడని ఇక అతనితో అవసరం లేదు తెగ బాధపడింది హారిక.
మోనాల్ తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తున్నందున అభినందించారు నాగ్. నోయల్ నేర్పించిన ర్యాప్ సాంగ్ని తెలుగులో పాడి వినిపించింది మొనాల్. కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నావ్.. అర్థమైంది కష్టపడి ప్రేమ.. అంటున్నావ్ ఎవరి ప్రేమ అంటూ మోనాల్ లవ్ ట్రాక్కి మరింత పదును పెట్టారు నాగార్జున. ఆ ప్రశ్న అడగ్గానే తెగ సిగ్గు పడిపోయింది మోనాల్.
కిల్లర్ కాయిన్స్ టాస్క్లో భాగంగా ఎవరు ఏవేవి తప్పులు చేశారో బోన్లో ఉంచి పోలీస్ ఆఫీసర్గా ప్రశ్నించాలని అడిగారు నాగ్. మొదటిగా అరియానా.. అమ్మా రాజశేఖర్ని బోనులో నిలబెట్టి ఆయన చేసిన తప్పుల్ని ఎండకట్టింది.అయితే రాజశేఖర్ తరుపున అవినాష్ డిఫెన్స్ చేసి వాదించాడు. అయితే ఈ వాదనలో ఎక్కువ మంది రాజశేఖర్ నిర్దోషి అని చెప్పారు. ఇక సుజాత, రాజశేఖర్ మాస్టర్లు సొహైల్ని దోషిని చేసే ప్రయత్నంగా చేయగా.. ఇంటి సభ్యులు నిర్దోషిగా తేల్చారు.