కేరళకు తిరుగు ప్రయాణమవనున్న బుల్లితెర నటి ప్రేమీ విశ్వనాథ్
By: chandrasekar Fri, 10 July 2020 12:01 PM
కేరళకు తిరుగుపయనమయ్యారు
తెలుగు బుల్లితెర అభిమాన నటి ప్రేమీ విశ్వనాథ్. లాక్ డౌన్ కారణంగా సుమారు
మూడునెలలపాటు సీరియల్ లేక ప్రేక్షకులకు కళ్లు కాయలు కాచేలా చూశారు. ప్రభుత్వ
సడలింపులతో తిరిగి సీరియల్, సినిమా షూటింగ్లు ప్రారంభం కావడంతో ప్రేమీ విశ్వనాథ్
అభిమానులు ఊపిరిపీల్చుకుని ఏడున్నర అయ్యేసరికి టీవీలకు అతుక్కుపోతున్నారు.
ఈలోపు టీవీ ఆర్టిస్ట్లకు
ఒక్కొరిగా కరోనా వ్యాపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో సీరియల్స్ కూడా
ఆగిపోతాయనే ప్రచారం నడిచింది. అయితే టీవీ అసోషియేషన్ పెద్దలు తలసానిని కలిసి
పరిస్థితిని
చక్కబెట్టుకోవడంతో షూటింగ్లకు ఢోకా లేదనే చెప్పాలి. ఈ తరుణంలో తాను
తిరిగి కేరళకు వెళిపోతున్నా అంటూ తన సొంత యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేసింది
ప్రేమీ విశ్వనాథ్. అయితే సీరియల్ షూటింగ్ ఆగిపోవడమే లేక వాయిదా పడటమో కాదు కాని తన
షెడ్యూల్ అయిపోవడంతో కేరళకు వెళిపోతుంది ప్రేమీ విశ్వనాథ్.
తెలుగు బుల్లితెర
బాహుబలిగా నిలిచిన కార్తీకదీపం సీరియల్ అభిమానులు ఎంతగానో అభిమానించే మన ప్రేమీ
విశ్వనాథ్ జూన్ 1 నుంచి ‘నేను వచ్చేశాను మీకోసం ఇక డైలీ అప్ డేట్స్
ఇచ్చేస్తాను’ అంటూ యూట్యూబ్లో అఫీషియల్గా వీడియోస్ అప్లోడ్ చేసింది. ప్రతిరోజు
షూటింగ్ అప్డేట్స్తో పాటు లొకేషన్ సందడిని తన ఛానల్ ద్వారా అభిమానులతో
పంచుకుంటుంది.
జూన్ 1 నుంచి
జూన్ 7 వరకు
వరుసగా 7
రోజులు షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చిన ప్రేమీకి సీరియల్ షూటింగ్లో షెడ్యూల్ పేకప్
అయ్యిందని తను కేరళ వెళ్తున్నానని, అక్కడ నుంచి కూడా అభిమానులకు అప్ డేట్స్ ఇస్తూనే
ఉంటానని హామీ ఇస్తోంది. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ చేసిన తాజా వీడియోలో ‘ఇప్పుడు నా
షూటింగ్ అయిపోయింది నాకు షెడ్యూల్ పేకప్ అయ్యింది. ఇంకా నేను కేరళా వెళ్లాలి ఇంకా
మనం నేను కేరళాలో ఉన్నప్పుడు ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను. ఇంకా కేరళాకి వెళ్లాక
కేరళా విషయాలు చెబుతాను నేను.’ అంటూ
ప్రేమి విశ్వనాథ్ మాట్లాడుతుండగా
బేబీ క్రితిక ఎంట్రీ ఇచ్చి అందరికీ హాయ్ చెప్పింది.
‘షెడ్యూల్ పేకప్ అయ్యింది. నాకు కాదు ప్రేమి అక్కకు
మాత్రమే నాకు రేపు షూటింగ్ ఉంది’ అంటూ క్యూట్ క్యూట్గా చెప్పింది సౌర్య(క్రితిక).
అయితే వంటలక్క కార్తీకదీపం సీరియల్కి మాత్రమే కాదు. ఆమె యూట్యూబ్ ఛానల్కి
వేలాదిగా అభిమానులు పెరుగుతూ ఉన్నారు.