Flash News: రజనీ నీ హోం క్వారంటైన్ తరలింపు...!
By: Anji Wed, 23 Dec 2020 10:16 PM
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది..
ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం రజనీ ‘అణ్ణాతే’ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. దానికి కారణం చిత్ర బృందంలో దాదాపు ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు.
దీంతో సినిమా షూటింగ్ను తాత్వాలికంగా నిలిపివేశారు. వారిలో ఒకరు హీరో రజనీకి క్లోజ్ అని తేలింది. దాంతో రజనీ హోం క్వారంటైన్ నిబంధనలు పాటించనున్నారు. అయితే గత వారం తమ నూతన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.
ఈ సినిమాను త్వరగా రూపొందించాలని చూస్తున్నారు. దానికి కారణం రజనీ కొత్తగా పెట్టిన సొంత పార్టీతో ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. దాంతో అణ్ణాతే చిత్ర యూనిట్ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేసేందుకు కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతోంది.
దాంతో ఎన్నికల కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. ఇటువంటి సమయంలో ఈ సంఘటన జరగడం పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా సిరుతై శివ దర్వకత్వంలో తెరకెక్కనుంది.
ఇది ఒక రూరల్ డ్రామాగా రూపొందతోంది. ఈ సినిమాలో లేడీ స్టార్ హీరోయిన్ నయనతారా, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారేమే వేచి చూడాలి.