ఓటీటీ వెబ్ సిరీస్లో తమన్నా...
By: chandrasekar Thu, 17 Sept 2020 09:41 AM
కరోనా వల్ల సినిమా
థియేటర్లు మూత పడడంతో ఓటీటీ ఇప్పుడు ప్రబలమవుతుంది. ఓటీటీ వెబ్ సిరీస్లో తమన్నా
నటించనున్నట్లు తెలిసింది. మిల్కీ బ్యూటీ కూడా డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కే వెబ్ సిరీస్లో ఆమె నటించనున్నట్లు
తెలుస్తోంది. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్లకు సినిమాలను మించిన ఆదరణ లభిస్తోంది.
ప్రజలు ఇంటిలోనే వుంది
పోవడంతో ఓటీటీ సంస్థలు కొత్త కాన్సెప్టులతో తెరకెక్కుతున్న వెబ్ సిరీసులను
ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో వెండితెర, బుల్లితెరను మించి డిజిటల్ తెర దూసుకుపోతోంది. దీంతో
సినీతారలు సైతం వీటిల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారితో పాటు
టెక్నీషియన్స్, దర్శకులు, నిర్మాతలు అందరూ డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
నటీ నటులు తిరిగి
షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమవ్వడంతో తెలుగులో ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు
వెబ్ సిరీసుల్లో నటిస్తుంటే మరికొందరు
అదే బాటలో నడుస్తున్నారు. ఆ లిస్టులో మిల్కీ బ్యూటీ తమన్నా చేరింది. ప్రముఖ
దర్శకుడు ప్రవీణ్ సత్తారు థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించే వెబ్ సిరీస్లో
తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సీరీస్ కోసం
ప్రవీణ్ డిజైన్ చేసిన పాత్ర తమన్నాకు నచ్చడంతో పచ్చజెండా ఊపేసిందన్న వార్త సోషల్మీడియాలో
హల్చల్ చేస్తోంది. 8 ఎపిసోడ్లతో తెరకెక్కించే ఈ వెబ్ సిరీస్ వివరాలను
దర్శకుడు త్వరలోనే ప్రకటించనున్నాడు. అభిమానులంతా దీనికోసం ఎదురుచూస్తున్నారు.