ఆ సినిమాతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ..తాప్సి
By: Sankar Tue, 14 July 2020 4:23 PM
బాలీవుడ్ లో హీరోయిన్ తాప్సి దూసుకుపోతుంది ..వరుసగా డిఫెరెంట్ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ..అయితే బాలీవుడ్ కంటే ముందే తెలుగులో హీరోయిన్ గా నటించిన తాప్సి ఇక్కడ మాత్రం అంతగా గుర్తింపు తెచుకోలేకపోయారు ..అయితే గతేడాది విడుదలైన ‘సాంఢ్ కీ ఆంఖ్’ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, తనకెన్నో మధురమైన ఙ్ఞాపకాలు ఉన్నాయంటూ తెలిపింది. “నా కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద ప్రయోగం ఇది. మొదటిసారి డైరెక్టర్గా తుషార్ హీరానందాని, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్లోనే మొదటిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎంతోమంది మొదటిసారిగా బాలీవుడ్ స్ర్కీన్పై తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఈ సినిమాతో నాకెన్నో మధురమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి అంటూ ఎమోషనల్ అయ్యింది.
దాదాపు 30కి పైగా జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న భారత మాజీ షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశి తోమర్ల జీవితకథ ఆధారంగా ‘సాంఢ్ కీ ఆంఖ్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ప్రకాశి తోమర్ పాత్రలో తాప్సి నటించగా, భూమి ఫెడ్నేకర్ చంద్రో తోమర్ పాత్రను పోషించారు. 2019 అక్టోబర్లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది