సుశాంత్ మరణంపై ప్రధానికి లేఖ రాసిన సుశాంత్ సోదరి
By: Sankar Sat, 01 Aug 2020 11:33 AM
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. సుశాంత్ బలవన్మరణం వెనుక బాలీవుడ్ పెద్దలు ఉన్నారని కొందరు అంటుంటే, సుశాంత్ తండ్రి కేకే సింగ్ .. రియానే తన కుమారుడిని చంపేసిందని ఆరోపిస్తున్నారు. మరి కొందరేమో ఈ కేసు విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని , తక్షణమే సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. ఇన్ని సవాళ్ళ మధ్య సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తన మనసులోని భావాలని తెలియజేశారు
నేను సుశాంత్ సోదరిని. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించి మాకు న్యాయం జరిగేలా చూడండి అంటూ పోస్ట్ పెట్టింది శ్వేతా సింగ్. డియర్ సర్.. మీరు సత్యం వైపే ఉంటారని నా మనసు చెబుతుంది. మేం సాధారణ కుటుంబ నుండి వచ్చాం. బాలీవుడ్లో నా తమ్ముడకి గాడ్ ఫాదర్ ఎవరు లేరు. మా పరిస్థితి కూడా ఇదే. ఈ కేసులో అన్ని ఆధారాలని పరిశీలించి సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, విచారణని పారదర్శకంగా జరిపించాలని అభ్యర్దిస్తున్నాము అని శ్వేతా పేర్కొంది.
కాగా బాలీవుడ్ యువ నటుడు అయిన సుశాంత్ సింగ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ..ఎంతో పేరు , మనీ , స్టార్ స్టేటస్ ఉన్న శుశాంత్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో అతడి మృతి మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ..ఇప్పటికే సుశాంత్ తండ్రి ఇప్పటికే సుశాంత్ మరణం మీద పాట్నాలో పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే..