Advertisement

  • ఆ ముచ్చట తీరకుండానే సుశాంత్ మమ్మల్ని వదిలివెళ్లారు ..సుశాంత్ తండ్రి ఉద్వేగం

ఆ ముచ్చట తీరకుండానే సుశాంత్ మమ్మల్ని వదిలివెళ్లారు ..సుశాంత్ తండ్రి ఉద్వేగం

By: Sankar Fri, 26 June 2020 12:09 PM

ఆ ముచ్చట తీరకుండానే సుశాంత్ మమ్మల్ని వదిలివెళ్లారు ..సుశాంత్ తండ్రి ఉద్వేగం


సుశాంత్ సింగ్ రాజపుత్ మరణించి రెండు వారలు కావొస్తున్నా ఇంకా చాల మందిని ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు ..సూపర్ హిట్ సినిమాలు , కావాల్సినంత డబ్బు , మంచి పేరు ఇలా అన్ని ఉన్నప్పటికీ సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు , కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందుతున్నారు ..తాజాగా సుశాంత్ తండ్రి మాట్లాడుతూ తీవ్ర బావోగ్వేదానికి గురి అయ్యారు ..పెళ్లి చేసుకోమని సుశాంత్‌ను ఎన్నోసార్లు అడిగాం. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల నుంచి బయటపడ్డాకే నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నానన్నాడు. పెళ్లి విషయం గురించి తనతో జరిగిన చివరి సంభాషణ అదే అంటూ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తండ్రి కేకే సింగ్‌ ఉద్వేగానికి లోనయ్యారు

తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ సుశాంత్‌కు ఇచ్చామని.. కానీ ఆ ముచ్చట తీరకుండానే తను శాశ్వతంగా తమకు దూరమయ్యాడని భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అందరితో కలివిడిగా ఉండేవాడని.. కానీ ఆత్మహత్యకు కొన్నిరోజుల ముందు తను ఎందుకు గంభీరంగా మారిపోయాడో తెలియదని ఆవేదన చెందారు.

ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కేకే సింగ్‌ను సుశాంత్‌ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించగా.. తన స్నేహితురాళ్ల గురించి తమకు తెలుసునన్నారు. నటి అంకిత లోఖండేతో తమ కుటుంబానికి పరిచయం ఉందని తెలిపారు. ముంబైతో పాటు తమ స్వస్థలం పట్నాలోని ఇంటికి కూడా ఆమె వచ్చిందని పేర్కొన్నారు. అదే విధంగా హీరోయిన్‌ కృతి సనన్‌ను కూడా ఓసారి ముంబైలో కలిశానన్న కేకే సింగ్‌.. ప్రస్తుతం సుశాంత్‌ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి గురించి మాత్రం తనకు ఏమీ తెలియదన్నారు.

Tags :
|

Advertisement