సుశాంత్ తన సినిమాలను తిరస్కరించాడని..అనురాగ్ కశ్యప్
By: chandrasekar Sat, 25 July 2020 1:58 PM
తాను రెండు ఆఫర్లు
ఇచ్చినట్లు దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్కు మేటి డైరక్టర్
అనురాగ్ కశ్యప్ తెలిపారు. కానీ సుశాంత్ తన సినిమాలను తిరస్కరించాడని యశ్రాజ్
ఫిల్మ్స్, ధర్మా ప్రొడక్షన్స్ నుంచి ద్రువీకరణ పత్రం
తీసుకువస్తేనే తన సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు కశ్యప్ గుర్తు చేశారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హసే
తో ఫసీ సినిమాలో సుశాంత్కు ఆఫర్ ఇచ్చానని, కానీ పెద్ద బ్యానర్ల చిత్రాల్లో నటించాలని సుశాంత్
నిర్ణయించుకున్నట్లు కశ్యప్ వెల్లడించారు.
పరిణీతి చోప్రా గురించి
కూడా తాను యశ్ రాజ్ ఫిల్మ్స్ను ఆశ్రయించినట్లు కశ్యప్ గుర్తు చేశారు. కానీ
సుశాంత్ మాత్రం ఆదిత్య చోప్రాతోనే పనిచేసేందుకు మొగ్గుచూపినట్లు తెలిపారు. యశ్రాజ్
ఫిల్మ్స్ అనుమతి మేరకే శుద్ దేశీ రొమాన్స్ ఫిల్మ్లో సుశాంత్ నటించినట్లు
అనురాగ్ చెప్పారు. అయితే హసే తో ఫసీ సినిమా కోసం సుశాంత్ స్థానంలో సిద్ధార్థ మల్హోత్రాను
తీసుకున్నట్లు డైరక్టర్ కశ్యప్ తెలిపారు. 2016లో సుశాంత్కు తాను మరో
ఫిల్మ్ ఆఫర్ చేసినట్లు అనురాగ్ వెల్లడించారు. కానీ ధోనీ సక్సెస్తో సుశాంత్ తనకు
రిప్లై ఇవ్వలేదన్నారు. బయటివాళ్లు ఎవరైనా
బాలీవుడ్లోకి వస్తే, వాళ్లు కచ్చితం పెద్ద బ్యానర్ల నుంచి ద్రువీకరణ పత్రం
తీసుకురావాల్సి ఉంటుందని కశ్యప్ తెలిపారు.
యశ్రాజ్, కరణ్
జోహార్, ధర్మా
ప్రొడక్షన్స్ , సంజయ్ లీలా భన్సాలీ లాంటి వారి అండదండలు ఉంటేనే
ఇతర సినిమాల్లో చేసే అవకాశం లభిస్తుందన్నారు. సుశాంత్ చాలా ట్యాలెంటెడ్ హీరో
అని, తాను
ఆఫర్ ఇచ్చినా.. అతను ధర్మా ప్రొడక్షన్తో డ్రైవ్ సినిమాను ఎంపిక చేసినట్లు
అనురాగ్ చెప్పారు. జూన్ 14వ తేదీన అనుమానాస్పద రీతిలో సుశాంత్ తన ఇంట్లోనే
సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ముంబై పోలీసులు ఈ కేసులో పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని
విచారించారు.