మళ్ళీ రేస్ గుర్రం కాంబినేషన్ ...?
By: Sankar Tue, 26 May 2020 3:09 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన రేస్ గుర్రం సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే ..ఆ సినిమాలో అల్లు అర్జున్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది..అయితే మళ్ళీ వీళ్లిద్దరి కలయికలో మరొక సినిమా రానుంది అని టాలీవుడ్ లో వార్త చక్కర్లు కొడుతుంది ..రేసుగుర్రం’ చిత్రానికి కథను అందించిన వక్కంతం వంశీతో కలిసి బన్ని కోసం ఓ కథను స్దిదం చేస్తున్నారట సురేందర్ రెడ్డి. ‘రేసుగుర్రం’కు మించిన పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్దం చేసే పనిలో వంశీ-సురేందర్ ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.
ఇక ప్రస్తుతం పుష్ఫ చిత్రంతో బిజీగా ఉన్న బన్ని ఆ తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’కు కమిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ సెట్స్పైకి వెళ్లనుంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్తో ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలని సురేందర్ రెడ్డి భారీగా ప్లాన్ చేస్తున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి మరో చిత్రాన్ని ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు. పలువురు హీరోలతో కథాచర్చలు జరిపినప్పటికీ కుదరలేదని టాలీవుడ్ టాక్. ఇక వీరిద్దరి కలయికలో మరో చిత్రం రావాలని బన్ని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. రేసుగుర్రం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా? లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.