Advertisement

  • అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్...!

అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్...!

By: Anji Fri, 18 Dec 2020 4:11 PM

అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్...!

మాట ఇవ్వడం అందరూ చేస్తారు. కానీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేవారు కొందరే. ఆ కొందరిలో నేను సైతం అని అంటున్నారు సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌. ఈ యువ కథనాయకుడు గురువారం విజయవాడలో సందడి చేశారు.

వాంబే కాలనీలోని 'అమ్మ ప్రేమ ఆదరణ' వృద్ధాశ్రమంను ఆయన ప్రారంభించారు. అలాగే ఆ వృద్ధాశ్రమంలో ఏర్పాటుచేసిన ఆశ్రమ ఫౌండర్‌ నారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆశ్రమంలోని వృద్ధులతో కాసేపు ముచ్చటించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమ్మ ప్రేమ ఆదరణ సేవా సమితి ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ తేజ్‌ను సంప్రదించింది. తమ వృద్ధాశ్రమంలో నిర్మాణ దశలో ఉన్న భవంతిని పూర్తిచేయడానికి సహకరించాలని కోరింది.

దీనికి సానుకూలంగా స్పందించిన తేజూ.. ఆ భవంతిని పూర్తిచేయడానికి, ఒక ఏడాది కాలంపాటు ఆశ్రమంలో ఆహారం తాను సరఫరా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భవంతి నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీని కోసం ఆయన ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

తన పుట్టినరోజుకి కటౌట్స్‌ పెట్టడం, బ్యానర్స్‌ ఏర్పాటు చేయకుండా ఆ డబ్బును అమ్మప్రేమ ఆదరణ వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేశారు. అభిమాన హీరో అలా అడగడంతో మెగాభిమానులు కాదనలేకపోయారు.

అందరూ భవన నిర్మాణానికి తమ వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. మెగాభిమానులు ఇచ్చిన అభిమానానికి తన వంతుగా సాయితేజ్‌ కూడా ముందుకు వచ్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు.


ఏడాది పాటు అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమానికి కావాల్సిన మౌలిక సదుపాయాల ఖర్చుని కూడా సాయితేజ్‌ సమకూర్చారు. ఆ సమయంలో అమ్మప్రేమఆదరణ సేవాసమితి సభ్యులు విజయవాడకు రావాలని సాయితేజ్‌కు కోరగా.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని అన్నారు.
అన్నమాట ప్రకారం గురువారం అమ్మప్రేమఆదరణ ఆశ్రమాన్ని సందర్శించారు. షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వృద్ధాశ్రమంను సందర్శించడంతో ఆ ప్రాంతమంతా మెగా అభిమానులతో నిండిపోయింది.

అందరి సహకారంతో మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. ఇక తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన చేసిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags :

Advertisement