మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి ..వైరల్ అవుతున్న మహేష్ బాబు ట్వీట్
By: Sankar Tue, 28 July 2020 7:58 PM
పెరుగుతున్న జనాభా, కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఈ పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రకృతి గురించి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఓ విలువైన సందేశం పోస్ట్ చేశారు.
నీటిని సంరక్షించుకోండి. పునరుత్పత్తి అయ్యేలా వనరులను ఉపయోగించండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ గ్లోబల్ క్రైసిస్ నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి. మన పకృతిని కూడా కాపాడాల్సిన ఆవశ్యకతను కూడా గుర్తుపెట్టుకోండి. మార్పు మొదట మన ఇంటి నుండే మొదలు కావాలి'' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ పెట్టిన ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లోనే వైరల్ అయిన ఈ ట్వీట్పై లైకులు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్తో మంచి ఫామ్లో ఉన్న మహేష్ బాబు మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సెట్స్ మీదకు వెళ్లనున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.