తమిళ చిత్రంపై ప్రశంసలు కురిపించిన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ..
By: Sankar Sun, 19 July 2020 2:49 PM
ఇటీవల కాలంలో ఒక సినిమా బాగుంటే దాని గురించి ప్రశంసించేందుకు ఇతర హీరోలు వెనుకాడటం లేదు ..అయితే టెక్నాలజీ పెరడగటంతో ఇతర భాషల్లో అద్భుతమైన సినిమాలను కూడా ఇంట్లోని కూర్చొని ఆస్వాదించే వెసులుబాటు ఉండటంతో ఒక బాష నటులు ఇతర బాషల సినిమాలను చూసి వాటి మీద తమ ప్రశంసలు కురిపిస్తున్నారు ..ఇటీవలే అలా వైకుంఠపురంలో సినిమా మీద ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే ..
అయితే తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఓ మై కడవులే’ తమిళ చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైన విషయం తెలిసిందే. లాక్డౌన్లో భాగంగా ఇంటికే పరిమితమై మహేశ్ కుటుంబానికి సమయం కేటాయిస్తూ పిల్లలతో గడుపుతున్నారు. ఈ క్రమంలో జూలై 18న సూపర్ స్టార్.. ‘ఓ మై కడవులే’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్లో చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.
‘ఓ మై కడవులే చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. హీరో అశోక్ సెల్వన్ పెర్ఫార్మెన్స్ సూపర్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు బ్రిలియంట్గా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అశోక్ చాలా సహజంగా కనిపించారు’ అని మహేశ్బాబు ట్విటర్లో ప్రశంసించారు.ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ..సరిలేరు నీకెవ్వరూ విజయంతో ఊపు మీద ఉన్న మహేష్ మరొక విజయం మీద కన్నేశారు ..