Advertisement

రాజమౌళి బాటలోనే సుకుమార్

By: Sankar Thu, 11 June 2020 08:36 AM

రాజమౌళి బాటలోనే సుకుమార్


కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు మరికొద్ది రోజుల్లో పునర్ ప్రారంభంకానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జూన్ 15 నుంచి షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో దర్శక నిర్మాతలు షూటింగ్‌లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, కరోనా నుంచి మనం సంపూర్ణంగా కోలుకోలేదు కాబట్టి ఇకపై షూటింగ్స్ అంత తేలికైన విషయం కాదు. దర్శక నిర్మాతలు తమకు ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్లి షూటింగ్స్ జరుపుకోడం జరిగే పనికాదు. అందుకు అనుమతులు కూడా దొరకని పరిస్థితి.

sukumar,pushpa,allu arjun,rajamouli,corona,lockdown ,రాజమౌళి ,  సుకుమార్ , కరోనా మహమ్మారి, సినిమా షూటింగ్‌, దర్శక నిర్మాత


సర్కారులు షూటింగ్స్ జరుపుకోవడానికి అనుమతులు ఇచ్చినా తాము నిర్దేశించిన విధివిధానాలను అనుసరించక తప్పదు. అలాగే, తెలుగు రాష్ట్రాల ఆవలకు వెళ్లి షూటింగ్‌లు జరపడం కూడా సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పెద్ద చిత్రాల నిర్మాతలు తమ సినిమాల షూటింగ్‌లను వీలైనంత వరకు సెట్స్‌లోనే జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. RRR సినిమా కోసం దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికే భారీ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఆ సెట్‌లోనే చాలా వరకు షూటింగ్ పూర్తి చేయనున్నారట. అయితే, దర్శకుడు సుకుమార్ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నారని అంటున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ పేరిట పాన్ ఇండియా మూవీని సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం. అటవీ ప్రాంతంలో షూటింగ్ జరపాలి. నిజానికి లాక్‌డౌన్‌కు ముందు సుకుమార్ పలు లొకేషన్లను చూసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆయా లొకేషన్లకు వెళ్లలేని పరిస్థితి. అందుకే, ఆ సన్నివేశాలు మినహా మిగిలిన సన్నివేశాల కోసం హైదరాబాద్‌లోనే సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతారట. దీనికి సంబంధించి ఇప్పటికే సుకుమార్ ప్లాన్స్ మొదలుపెట్టారని అంటున్నారు. గతంలో ‘రంగస్థలం’ సినిమా కోసం బంజారాహిల్స్‌లోనే సుకుమార్ భారీ సెట్ వేశారు. పల్లెటూరు వాతావరణాన్ని సిటీలో క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు ఎలాంటి సెట్స్ వేస్తారో చూడాలి.

Tags :
|
|

Advertisement