Advertisement

  • తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ ..

తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ ..

By: Sankar Thu, 09 July 2020 07:07 AM

తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ ..

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సీలెబ్రిటీలకు ప్రైవేట్ జీవితం అనేది లేకుండా అయింది ..వాళ్ళు ఏది చేసిన వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది ..అయితే ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చి హాస్పిటల్ కు వెళ్లిన సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియా లో అనేక వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ..అలాంటి వార్తలే దిగ్గజ రచయిత సుద్దాల అశోక్ తేజ గారి గురించి కూడా అనేక వెబ్సైటు లలో ,యూట్యూబ్ ఛానెళ్లలో వచ్చాయి ..అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, తాను ఆరోగ్యంగా ఉన్నాని స్వయంగా సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.

మీ అందరి ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తరవాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. కాకపోతే, ఈ కరోనా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప.. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమంగా ఉందని వార్తల్లో వచ్చినట్టు తెలిసింది. వాటిలో నిజం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’’ అని వీడియోలో అశోక్ తేజ వెల్లడించారు.

కాగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దిగ్గజ రచయితల్లో సుద్దాల అశోక్ తేజ ఒకరు ..జాతీయ స్థాయిలో తాను రాసిన పాటకు అవార్డు అందుకున్నారు ..మెగా స్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని నేను సైతం పాటకు ఆయన జాతీయ అవార్డు గెలుచుకున్నాడు ..కేవలం సినిమా పాటలే కాకుండా తెలంగాణ యాసలో విప్లవాత్మక పాటలు కూడా అశోక్ తేజ రాస్తుంటారు.

Tags :
|
|

Advertisement