- హోమ్›
- వినోదం›
- ఆర్ఆర్ఆర్ లో ఒక హీరో ఎక్కువ ఒక హీరో తక్కువ కాదు ..ఇద్దరికీ పవర్ ఫుల్ డైలాగులు రాసా ..సాయి మాధవ్ బుర్రా
ఆర్ఆర్ఆర్ లో ఒక హీరో ఎక్కువ ఒక హీరో తక్కువ కాదు ..ఇద్దరికీ పవర్ ఫుల్ డైలాగులు రాసా ..సాయి మాధవ్ బుర్రా
By: Sankar Fri, 17 July 2020 3:43 PM
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమా అంటే ఇది అని చెప్పుకునేలా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ ..ఇప్పటికే బాహుబలి సినిమాలతో ఇండియా వ్యాప్తంగానే గాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి ..బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడం మరియు ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి ..
అయితే ఎన్నో హిట్ చిత్రాలకి డైలాగ్ రైటర్గా పని చేసిన సాయి మాధవ్ బుర్రా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి పని చేస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్కి సంబంధించి సాయి మాధవ్ బుర్రా చెప్పిన ఆసక్తికర విషయాలు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్కి అమితానందాన్ని కలిగిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన ఏ విషయమైన అభిమానులలో చాలా ఆసక్తిని కలిగిస్తుంది. తాజాగా ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల నిడివి గురించి సాయి మాధవన్ చెప్పిన మాటలు ఫ్యాన్స్కి సంతోషాన్నిస్తున్నాయి. చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ పాత్రలని రాజమౌళి ఎలా బ్యాలెన్స్ చేశారో, నేను కూడా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా ఇద్దరికి సరిసమానంగా డైలాగ్స్ రాశానని బుర్రా అన్నారు.
ఇద్దరి పాత్రల నిడివి కూడా సమానంగా ఉంటుందని, అభిమానులు ఇలాంటి విషయాలలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. ప్రేక్షకుల అంచనాలకి మించి ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లడం పక్కా అంటూ సాయి మాధవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.