Advertisement

  • మూడేళ్ళ తర్వాత ఓటిటి లో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోయిన్ సినిమా..

మూడేళ్ళ తర్వాత ఓటిటి లో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోయిన్ సినిమా..

By: Sankar Fri, 28 Aug 2020 12:30 PM

మూడేళ్ళ తర్వాత ఓటిటి లో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోయిన్ సినిమా..


త్రిష సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు ..తెలుగు , తమిళ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ చెన్నై ముద్దుగుమ్మ..తెలుగులో చిరంజీవి , బాలయ్య , వెంకటేష్ , నాగార్జున , పవన్ కళ్యాణ్ , మహేష్ , ప్రభాస్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో కూడా నటించి దాదాపు దశాబ్దం పైగానే స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది..

ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాల్లో కనిపిస్తున్న త్రిష చివరగా రజనీ 'పేటా' మూవీలో మెరిసింది. త్రిష నటించిన '96' మూవీ ఎంతపెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. అయితే తెలుగులో పెద్దగా నటించకపోయిన తమిళ్ మాత్రం సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది త్రిష . ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి త్రిష 'శతురంగ వెట్టయ్ -2' అనే సినిమా చేసింది. ఈసినిమా అనేక కారణాలతో విడుదలకు నోచుకోలేదు.

ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుందట. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

Tags :
|
|

Advertisement