Advertisement

  • ఓటిటి లో పోటీపడుతున్న అనుష్క మరియు రాజ్ తరుణ్ సినిమాలు

ఓటిటి లో పోటీపడుతున్న అనుష్క మరియు రాజ్ తరుణ్ సినిమాలు

By: Sankar Fri, 25 Sept 2020 07:51 AM

ఓటిటి లో పోటీపడుతున్న అనుష్క మరియు రాజ్ తరుణ్ సినిమాలు


కరోనా కి ముందు సినిమాలు థియేటర్లలో పోటీ పడేవి..కానీ కరోనా వచ్చిన తర్వాత థియేటర్ లు అన్ని క్లోజ్ అవ్వడంతో సినిమాలు అన్ని రిలీజ్ ఆగిపోయాయి..ఆ లోపే ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ పుంజుకోవడంతో సినిమాలు అన్ని మెల్లగా అందులో రిలీజ్ అవుతున్నాయి..ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా కూడా ప్రైమ్ లో రిలీజ్ అయింది..

ఇక స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా నిశ్శబ్దం. ఈసినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించగా మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అవుతుంది. 'నిశబ్దం' మరియు యువ హీరో రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలు ఒకే రోజున వేరు వేరు ఓటీటీలలో రిలీజ్ కానున్నాయి.

అక్టోబర్ 2న తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో 'ఒరేయ్ బుజ్జిగా' విడుదల కానుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ - హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. డిజిటల్ స్ట్రీమింగ్ వార్ లో అమెజాన్ లో 'నిశబ్దం' మరియు ఆహాలో 'ఒరేయ్ బుజ్జిగా' పోటీ పడనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రెండిటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.

Tags :

Advertisement