Advertisement

  • ప్రభాస్ ఆది పురుష్ పోస్టర్ పై స్పందించిన జక్కన రాజమౌళి

ప్రభాస్ ఆది పురుష్ పోస్టర్ పై స్పందించిన జక్కన రాజమౌళి

By: Sankar Sun, 23 Aug 2020 1:53 PM

ప్రభాస్ ఆది పురుష్ పోస్టర్ పై స్పందించిన జక్కన రాజమౌళి


బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చాడు రాజ‌మౌళి. రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రంలో బాహుబ‌లి, అమ‌రేంద్ర బాహుబ‌లిగా ప్ర‌భాస్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం రాధే శ్యామ్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూడు కూడా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా `ఆదిపురుష్` సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ప్ర‌భాస్.. రాముడిగా క‌నిపించ‌నున్నాడు. దీనిపై స్పందించిన రాజ‌మౌళి ఆదిపురుష్ పోస్ట‌ర్ నేను ఎప్పుడో చూశాను. అయోధ్య‌లో ఇటీవ‌ల భూమి పూజ జ‌రిగింది. దేశ‌మంతా రాముడి గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ స‌మ‌యంలో రాముడి మీద సినిమా వ‌స్తే అద్భుతంగా ఉంటుంది. ఆదిపురుష్‌తో ప్ర‌భాస్ రేంజ్ మరింత పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని జ‌క్క‌న్న పేర్కొన్నారు

కాగా రాజమౌళి ప్రస్తతం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే..అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుంది అనగా రాజమౌళి కరోనా భారిన పడ్డారు ..ప్రస్తతం కరోనా నుంచి కోలుకున్న జక్కన త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టె అవకాశం ఉంది..భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో టాలీవుడ్ మొత్తం ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు

Tags :

Advertisement