ప్రభాస్ ఆది పురుష్ పోస్టర్ పై స్పందించిన జక్కన రాజమౌళి
By: Sankar Sun, 23 Aug 2020 1:53 PM
బాహుబలి సినిమాతో ప్రభాస్ని పాన్ ఇండియా స్టార్గా మార్చాడు రాజమౌళి. రెండు పార్ట్లుగా తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఓం రౌత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూడు కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా `ఆదిపురుష్` సినిమాకి సంబంధించిన పోస్టర్ రీసెంట్గా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్.. రాముడిగా కనిపించనున్నాడు. దీనిపై స్పందించిన రాజమౌళి ఆదిపురుష్ పోస్టర్ నేను ఎప్పుడో చూశాను. అయోధ్యలో ఇటీవల భూమి పూజ జరిగింది. దేశమంతా రాముడి గురించే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో రాముడి మీద సినిమా వస్తే అద్భుతంగా ఉంటుంది. ఆదిపురుష్తో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని జక్కన్న పేర్కొన్నారు
కాగా రాజమౌళి ప్రస్తతం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే..అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుంది అనగా రాజమౌళి కరోనా భారిన పడ్డారు ..ప్రస్తతం కరోనా నుంచి కోలుకున్న జక్కన త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టె అవకాశం ఉంది..భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో టాలీవుడ్ మొత్తం ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు