Advertisement

  • ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్ ...ఎందుకో తెలుసా!

ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్ ...ఎందుకో తెలుసా!

By: Sankar Fri, 27 Nov 2020 12:05 PM

ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్ ...ఎందుకో తెలుసా!


నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా తెలుగులోనే కాక ఇండియా మొత్తం గర్వించ దగ్గ గొప్ప సింగర్లలోఒకడైన ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే...చాల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఎస్పీబీ కరోనా నుంచి మాత్రం బయటపడలేకపోయారు...

Tags :
|
|

Advertisement