సింపుల్గా నితిన్,షాలినిల నిశ్చితార్ధం
By: chandrasekar Thu, 23 July 2020 11:39 AM
నితిన్, షాలినిల ఎంగేజ్మెంట్ కరోనా కారణంగా వాయిదా పడ్డ
సంగతి అందరికి తెలిసిందే. నిన్నవారి
ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో షాలిని ఇంటిదగ్గర సింపుల్గా జరిగింది.
నితిన్, షాలినిల కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ ఇద్దరి వివాహ వేడుక ఈ నెల 26న ఉదయం
8గంటల 30
నిమిషాలకు ఫలక్నామా ప్యాలెస్లో జరగనుంది.
ప్రభుత్వ నియమ నిబంధనలకు
లోబడి ఈ వివాహం జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న పెళ్ళి సంబురాలకి కేవలం
కుటుంబ సభ్యలు మాత్రమే పాల్గొననున్నారట.
కాగా, ఫిబ్రవరిలో నితిన్, షాలినిల పసుపు, కుంకుమ
వేడుక జరిగిన విషయం విదితమే. ఇక వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్తో
పాటు పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్తో
పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.