Advertisement

  • 'నా పేరు మీనాక్షి' సీరియల్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్

'నా పేరు మీనాక్షి' సీరియల్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్

By: Sankar Wed, 01 July 2020 4:35 PM

'నా పేరు మీనాక్షి' సీరియల్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్



కరోనా కారణంగా సినిమా మరియు టివి రంగం దారుణంగా దెబ్బతిన్నది ...లాక్ డౌన్ కారణంగా సినిమా మరియు టివి షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి ..అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వడంతో సినిమాలు మరియు సీరియల్స్ మళ్ళీ షూటింగ్స్ ప్రారంభించాయి ..అయితే ఆలా షూటింగ్స్ ప్రారంభం అయ్యాయో లేదో ఇలా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి ..ఇప్పటికే ఇద్దరు టివి నటులకు కరోనా పాజిటివ్ రాగా , ఇప్పుడు మరొక ఫేమస్ సీరియల్ నటి కరోనా బారిన పడ్డారు ..

ఈటివి , మా టీవీ లలో వివిధ సీరియల్ లలో నటించే నవ్య స్వామికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కంఫర్మ్ అయింది ..గత మూడు, నాలుగు రోజులుగా ఆమె తలనొప్పి, అలసటతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కరోనా టెస్టు చేయించగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు..

ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. గత రాత్రి నుంచి ఉదయం వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. రాత్రంతా నిద్ర పోలేదు. నా బాధ చూసి మా అమ్మ కూడా ఏడుస్తూనే ఉంది. నా ఫోన్‌ బిజీగా ఉంది. కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. చాలా మందితో మాట్లాడాను. నా వాట్సాప్‌ మొత్తం కరోనా లక్షణాలు, చికిత్సకు సంబంధించిన మెసేజ్‌లతో నిండిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. నా సహనటులు, ఇతర సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు చాలా బాధపడుతున్నాను. శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారంతా ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నారు నవ్య. రెండు వారాల నుంచి ఆమె టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నవ్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న వారందరికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు

Tags :
|
|
|

Advertisement