Advertisement

  • సంచలన హంతకుడు సైనైడ్ మోహన్ జీవితం మీద నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడి సినిమా..

సంచలన హంతకుడు సైనైడ్ మోహన్ జీవితం మీద నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడి సినిమా..

By: Sankar Thu, 01 Oct 2020 4:31 PM

సంచలన హంతకుడు సైనైడ్ మోహన్  జీవితం మీద నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడి సినిమా..


సంచలన హంతకుడు సైనైడ్ మోహన్. ఈ పేరు వింటేనే వెన్ను వణుకుద్ది . ఈ నరరూప హంతకుడు 20 మంది మహిళలను అతి కిరాతకంగా హత్య చేసాడు. కర్ణాటకలోని ఓ పాఠశాలలో పీటీ టీచర్ గా పనిచేసిన ఇతను క్రమంగా క్రూరుడిగా మారాడు. వయసు మీదపడినా పెళ్లికాని మహిళలను టార్గెట్ చేసి మీద కన్నేసి వారికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొని ఆతర్వాత గర్భనిరోధక మాత్రలను చెప్పి సైనాడ్ ఇచ్చి చంపేశాడు.

ఇలా 20 మంది మహిళలను చంపాడు . చంపిన తర్వాత డబ్బు , బంగారం తో ఉడాయించే వాడు. అయితే ఓ హత్య కేసులో అనుకోకుండా పోలీసులకు చిక్కిన అతను చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్ కు గురయ్యారు. తీగ లాగితే అతడి నేరచరిత్ర మొత్తం కదిలింది. తాను 20కి పైగా హత్యలు చేసినట్లు అతను అంగీకరించాడు. సైనైడ్ మోహన్ గా పేరు పడ్డ ఈ హంతకుడికి 2013లో కోర్టులో జైలు శిక్ష కూడా పడింది.

ఇప్పుడు ఇతని పైన సినిమా తెరకెక్కనుంది. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సైనైడ్ అనే టైటిల్ తో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో కీలక పాత్రను సీనియర్ హీరోయిన్ ప్రియమణి పోషించింది.సైనైడ్ సినిమాను కన్నడం.. తెలుగు, మలయాళం, తమిళం, హిందీల్లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చారు.

Tags :
|

Advertisement