హారర్ థ్రిల్లర్ జోనర్లో సమంత...
By: chandrasekar Thu, 15 Oct 2020 09:36 AM
‘ఓ బేబీ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకులను
అలరించిన సమంత ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా కొత్త సినిమాలేవీ చేయలేదు. అనివార్య
కారణాలతో ‘మహాసముద్రం’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సామ్ అశ్విన్ శరవణన్
డైరెక్షన్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా అందిన సమాచారం
ప్రకారం ఈ సినిమాకు డైరెక్టర్ మారినట్లు తెలుస్తోంది. అశ్విన్ శరవణన్ స్థానంలో నందినీ రెడ్డి ఈ
సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో
తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుపై
త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.
సమంత కెరీర్లోనే ప్రత్యేక
చిత్రంగా నిలిచిన ‘ఓ బేబీ’కి నందినీ రెడ్డి దర్శకురాలు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో
వస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలున్నాయి.