సునీల్ కి హీరోయిన్గా సలోనీ మరోసారి ..
By: chandrasekar Sat, 28 Nov 2020 6:23 PM
సునీల్ తొలి సినిమా
‘అందాల రాముడి’తోనే అలరించిన ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద
రామన్న’తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత హీరోగా నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో
సునీల్కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు విలన్గా మారిన సునీల్ ఇటీవలే
‘కలర్ ఫోటో’తో ఆకట్టుకున్నారు.
సుకుమార్, అల్లు
అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో కూడా సునీల్ విలన్గా
నటిస్తున్నట్లు టాక్. ‘మర్యాద రామన్న’లో ప్రేక్షకులను అలరించిన సునీల్, సలోనీ
జంట మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. సునీల్ ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య
దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా సలోనీని సెలక్ట్ చేసినట్లు
సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు వినికిడి. ఈ వార్తే గనుక
నిజమైతే సునీల్, సలోని కలిసి పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కలిసి
సందడి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోందట.