సాయి పల్లవి తెరపై కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువ ఇష్టపడుతుంది
By: chandrasekar Sat, 27 June 2020 10:51 AM
తెలుగులో శేఖర్ కమ్ముల
దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ
కట్టిపడేసింది. సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ
అదరగొట్టింది. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు
హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి.
సాయిపల్లవి ప్రస్తుతం
తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల
దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో
పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్గా వస్తోంది. రానా రాజకీయ
నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది.
సాయి పల్లవి తెలుగులో మరో
సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి
పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు.
అది అలా ఉంటే తాజాగా సాయి
పల్లవి మీడియాతో మాట్లాడుతూ తనకు సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఒక వేళా నటి కాకుంటే ఏం చేసుండే వారని అడగగా సాయి పల్లవి స్పందిస్తూ ఎంబీబీఎస్
తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని తెలిపింది.
ఎవరికి తెలియని విషయం
చెప్పండని అడగగా మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదని
సమాదానం ఇచ్చింది. ఇక ఎప్పుడైన ఏడ్చారా అని ప్రశ్నించగా ఎన్జీకే సమయంలో చేసిన సీన్నే
పదే పదే రీషూట్ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు సినిమాలను వదిలేస్తానని
అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ 'మొదటి
నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువగా
ఇష్టపడతాను. కురచగా ఉండే బట్టలు వేసుకోవడం లేదా మోతాదుకు మించిన వయ్యారాలు
ఒలకబోయడం నాకు ఇష్టం ఉండదు. నావల్ల కాదని
చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఫిదా' సినిమాలో ఒక సీన్ లో కురచ డ్రెస్ వేసుకున్నాను. ఆ
సన్నివేశానికి అది అవసరం.
ఆ సినిమాలో అలా
వేసుకున్నానని అలాగే మరో సినిమాలో కనిపించాలంటే మాత్రం కుదరదని తేల్చేసింది. అలా
చేయాలనీ ఒత్తిడి చేస్తే ఆ సినిమాను వదులుకుంటా.
ఇలా వదులుకున్న సినిమాలు చాలా వున్నాయంది. ఇక సాయి పల్లవి సినిమాల
విషయానికి వస్తే ఆమె తాజాగా మరో అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో
శర్వానంద్కు జోడిగా మహా సముద్రంలో నటించనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు నాని హీరోగా వస్తోన్న శ్యామ్
సింగరాయ్ సినిమాలో ఓ హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు సమాచారం.