సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుంది
By: chandrasekar Thu, 28 May 2020 4:34 PM
సాయి పల్లవి వేణు ఊడుగుల
దర్శకత్వంలో విరాటపర్వంలో సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి
అందగత్తే కాదు మంచి నటి కూడా. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో
తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో
మాట్లాడుతూ అదరగొట్టింటి. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా
పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది.
సాయి పల్లవి ప్రస్తుతం 'విరాట పర్వం' లో
నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా సాయి పల్లవి లుక్ను చిత్రబృందం
విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్లో సాయి పల్లవి ఎరుపు రంగు డ్రెస్లో అమరవీరుల
స్థూపం దగ్గర ఓ సాధారణ అమ్మాయిలా కూర్చోని ఉంది.
రానా హీరోగా చేస్తున్నారు.
తెలంగాణ నేపథ్యంలో
పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ
థ్రిల్లర్గా వస్తోంది. రానా పోలీస్ ఆఫీసర్గాను, సాయిపల్లవి నక్సలైట్గా కనిపించనున్నది అనేది
సమాచారం. సాయిపల్లవి ఎందుకు నక్సలైట్ గా మారవలసి వచ్చింది? నక్సలైట్ గా మారిన ఆమె చివరికి సాధించినది ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు.
అనుకున్నది
సాధించే క్రమంలో ఆమె తన ప్రాణాలను కూడా కోల్పోతుందట. ఆ సన్నివేశంలో సాయి పల్లవి
నటనతో ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. సినిమా అంతటికి ఆ
సన్నివేశం హైలైట్గా ఉంటుందట.
ఈ సినిమాలో రానా పాత్ర
పాజిటివ్ తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందట. మంచి కోసం పోరాడే ఓ చెడ్డ
వాడి కథే పర్వం. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 90లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో
భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారట.
విరాటపర్వంను అటూ హిందీ, తమిళ
భాషల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.