టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరోక స్టార్ హీరో
By: Sankar Sun, 23 Aug 2020 11:51 AM
టాలీవుడ్ లో ఉన్న బాచిలర్స్ అంత ఈ కరోనా టైం లో ఒక్కొకరుగా తమ బాచిలర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు..ఇప్పటికే నిఖిల్ , నితిన్ , రానా పెళ్లి చేసుకోగా , మెగా డాటర్ నిహారిక కూడా ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుంది..మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సోలో బతుకే సో బెటర్. ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్లో పెళ్ళి వద్దంటూ తేజ్ చెప్పుకొస్తాడు.
కాని అనుకున్నది ఒక్కటి, అయింది ఒక్కటి అన్నట్టు.. అన్ని చెప్పిన సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది.కొద్ది సేపటి క్రితం తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్కి సారీ చెబుతూ ..ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు తప్పదు మరి అని చెప్పుకొచ్చాడు మెగా మేనల్లుడు.
బ్యాచిలర్ హీరోలందరు కలిసి ఉన్న సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూప్ నుండి నిఖిల్, నితిన్, రానా ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ కాగా, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా లెఫ్ట్ అయ్యాడు. దీంతో అభిమానులందరు త్వరలో సాయి తేజ్ పెళ్లి పీటలెక్కడం ఖాయమని డిసైడ్ అయ్యారు. ఈ మేటర్కి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే రేపు ఉదయం 10గం.ల వరకు ఆగక తప్పదు.