2020 నాకు తీవ్ర నిరాశ మిగిల్చిందన్న రీతూ వర్మ
By: chandrasekar Mon, 14 Dec 2020 3:56 PM
తెలుగమ్మాయి రీతూ వర్మ
మాట్లాడుతూ 2020 నాకు తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పుకొచ్చింది. ఆమె
మొదటిగా నటించిన ‘బాద్షా’ సినిమాలో కాజల్
చెల్లెలిగా నటించి ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి
పేరు సంపాదించింది. ప్రస్తుతం ఆమె
తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళం
సినిమాల్లోనూ నటిస్తూ విజయం సాధిస్తుంది.
ఈ సంవత్సరం మొదటిలో
మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్తో చేసిన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాతో
గొప్ప విజయం అందుకున్న తరువాత ఈమె ప్రస్తుతం విక్రమ్తో తమిళ చిత్రం ‘ధృవ
నచ్చత్తిరమ్’ లోను నానితో ‘టక్ జగదీష్’
చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆ తరువాత తను కరోనా
కారణంగా చాలా నష్టపోయానని వెల్లడించింది.
ఈ ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్లతో బిజీ బిజీగా గడిచిపోయింది ఈ ముద్దు గుమ్మ.
ఆ వెంటనే దుల్కర్తో చేసిన సినిమా సూపర్ హిట్ కావడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా
పోయిందని తెలిపింది.
దీంతో 2020
సంవత్సరం నాకు మరుపురానిదిగా మిగిలిపోతుందని, ఏడాది చివరి రోజు వరకు ఈ ఆనందం కొనసాగుతుందని చాలా
ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆ సమయంలో నా
చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ ఈ ఏడాది చివరిలోగ విడుదల కావాల్సినవే. అయితే కరోనా దెబ్బకు ఆ
సినిమాల షూటింగులన్నీ ఆగిపోవడంతో ఈ ఏడాది నాకు తీవ్ర నిరాశ మిగిల్చింది అని
చెప్పింది. క్రమంగా విజయాలు అందుకుంటున్న ఈ నటి మరిన్ని విజయాలు సాధించాలని
కోరుకుందాం.